శ్రీవారి హుండీలో 20 బంగారు బిస్కెట్లు

by  |
శ్రీవారి హుండీలో 20 బంగారు బిస్కెట్లు
X

దిశ ఏపీ బ్యూరో: సుదీర్ఘ విరామం తరువాత తెరుచుకున్న కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అజ్ఞాత భక్తుడు స్వామివారికి అత్యంత ఖరీదైన కానుకలు సమర్పించారు. శ్రీవారి హుండీలో ఆ వ్యక్తి 20 బంగారు బిస్కెట్లు వేశారు. ఒక్కొక్క బిస్కెట్ బరువు 100 గ్రాములు ఉన్నట్టు గుర్తించారు. అటు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, జూన్ 11 నుంచి జూలై 10 వరకు హుండీ ఆదాయం రూ.16.73 కోట్లు వచ్చిందని వెల్లడించారు. భక్తుల తలనీలాలతో రూ.7 కోట్ల మేర అదనంగా వచ్చిందని తెలిపారు. తలనీలాల విలువ పెరగడంతో అదనపు ఆదాయం వచ్చిందని అన్నారు.


Next Story

Most Viewed