శ్రీశైలం పాతాళ గంగలో మృతదేహం.. సూసైడ్ నోట్‌ రాసి మరీ దూకాడు!

by  |
శ్రీశైలం పాతాళ గంగలో మృతదేహం.. సూసైడ్ నోట్‌ రాసి మరీ దూకాడు!
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం డ్యామ్ సమీపంలో గల లింగాలగట్టు పాతాళ గంగలో గుర్తు తెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. మృతుడు టీఎన్ 22 బీజే 9587 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై పాతాళ గంగ వద్దకు చేరుకొని గంగలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని మృతదేహంగా గుర్తించిన మత్స్యకారులు అమ్రాబాద్ మండలం ఈగలపెంట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్దలికి చేరుకున్న కృష్ణ దేవ్ డెడ్ బాడీని మత్స్యకారుల సహకారంతో బయటకు తీశారు.

ఎస్ఐ కథనం ప్రకారం.. మృతుడు మెదక్ జిల్లా గాంధీనగర్‌కు చెందిన దోనిపుడి సాంబశివరావు(48)గా గుర్తించినట్టు తెలిపారు. మృతుడు గత నాలుగు రోజుల కిందట శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గౌరిశంకర్ లాడ్జి రూమ్ నెంబర్ 4ను అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మూడు రోజుల కిందట మృతుడు సాంబశివరావు శ్రీ శైలం డ్యామ్ లింగాలగట్టు పాతాళగంగ బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద సూసైడ్ నోట్ దొరికిందని.. తన పరిస్థితి బాలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడని తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి మృతుని బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. అనంతరం కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఈగలపెంట ఎస్‌ఐ తెలిపారు.

Next Story

Most Viewed