మన్మోహన్, అరుణ్ జైట్లీ రికార్డు బ్రేక్ చేసిన నిర్మలా సీతారామన్

by Disha Web Desk 2 |
మన్మోహన్, అరుణ్ జైట్లీ రికార్డు బ్రేక్ చేసిన నిర్మలా సీతారామన్
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెడుతుండటంతో అంతా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బడ్జెట్‌ కూడా అన్ని వర్గాలకు సంతృప్తి కలిగించేలానే రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్ ఎలా ఉండబోతుందని ఇప్పటికే నిపుణుల్లో, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల్లో క్లారిటీ వచ్చేసింది.

ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు తమకు అనుకూల ప్రకటనలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా.. బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘతన సాధించారు. వరుసగా ఆరో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏకైక మహిళా రికార్డు సృష్టించగా, మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను బ్రేక్ చేసింది. కాగా, ఈసారి డిజిటల్ రూపంలో బడ్జెట్‌ను ప్రశే పెడుతోన్న విషయం తెలిసిందే.

Read More..

2024 మధ్యంతర బడ్జెట్: ఈ రంగాల స్టాక్స్‌కు భారీ శుభవార్త ఉండే ఛాన్స్

Next Story