కుష్బూ దోశలు.. స్మృతి ఇరానీ దాండియా ఆటలు

by  |
కుష్బూ దోశలు.. స్మృతి ఇరానీ దాండియా ఆటలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మరో వైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మహిళా నేతలు ఓటర్లను ఆకర్షించుకునేందుకు వినూత్నంగా ట్రయ్ చేస్తున్నారు.

తమిళనాడులోని కోయంబత్తూర్​సౌత్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వనతి శ్రీనివాసన్​ తరఫున బీజేపీ నేత, కేంద్ర మంత్రి నేత స్మృతి ఇరానీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆమె కార్యకర్తలతో కలిసి దాండియా నృత్యం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత కుష్బూ థౌజండ్​ లైట్స్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా.. ఆమె ఓ చిన్న హోటల్‌కు వెళ్లి దోశలు వేశారు. ఇలా ఏదో ఒక పని చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నేతలు.


Next Story

Most Viewed