సీఎం జ‌గ‌న్‌కు కేంద్ర మంత్రి ప్రశంసలు

by  |
సీఎం జ‌గ‌న్‌కు కేంద్ర మంత్రి ప్రశంసలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, సచివాలయాల ఏర్పాటు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్పోక్రియల్ కొనియాడారు. గురువారం వెబినార్ ద్వారా అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్ఆర్డీ ఉన్నతాధికారులతో ఎన్‌సీఈఆర్‌టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక చర్యలను మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రికి వివరించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యాకానుక, నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాల గురించి తెలియజేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ సంస్కరణలను వినూత్నంగా అమలు చేస్తూ అద్భుత పాలన అందిస్తున్నారని మంత్రి రమేష్ పోక్రియల్ ప్రశంశించారు. ఏపీని మిగతా రాష్ట్రాలు అనుసరిస్తే బావుంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు.


Next Story

Most Viewed