ఘోర రోడ్డు ప్రమాదం.. కేంద్ర మంత్రికి గాయాలు

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. కేంద్ర మంత్రికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రమంత్రి ప్రతాప్ సారంగికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాల ప్రకారం.. ఒడిశాలో బాలేశ్వర్ జిల్లాలోని నీలగిరి ప్రాంతంలో కేంద్ర మంత్రి ప్రతాప్​సారంగి కారును ఓ ట్రాక్టర్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో మంత్రితో పాటు ఆయన పీఏ, కారు డ్రైవర్‌ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వారని స్థానికంగా ఓ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

Advertisement
Next Story