పదోసారి చర్చలు కొలిక్కి వచ్చేనా.. రైతులతో కేంద్రం చర్చలు

by  |
పదోసారి చర్చలు కొలిక్కి వచ్చేనా.. రైతులతో కేంద్రం చర్చలు
X

దిశ,వెబ్‌డెస్క్: రైతు సంఘాలతో కేంద్రం పదో విడత చర్చలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు కేంద్రమంత్రులు తోమర్, పీయూష్ గోయల్, ఓం ప్రకాష్ లు సమావేశమయ్యారు. ఇప్పటి వరకు 9సార్లు కేంద్రం రైతులతో సంప్రదింపులు జరిపింది. కానీ ఇప్పటి వరకు ఆ చర్చలు సఫలం కాలేదు. కానీ జనవరి 15న జరిగిన చర్చల్లో తాము తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో అభ్యంతరాలు ఉన్నాయో చెబితే వాటిని పరిష్కరిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ ప్రతిపాదనలు తెచ్చారు. కానీ రైతులు మాత్రం చట్టం మొత్తం అభ్యంతరకరంగా ఉందని, వాటిలోని అభ్యంతరకరాలను పరిష్కరిస్తే లాభంలేదన్నారు. ఈ నేపథ్యంలో నేడు కేంద్రం రైతు సంఘాలతో కొనసాగుతున్న భేటీ చర్చాంశనీయంగా మారింది. తొమ్మిది సార్లు చర్చలు విఫలం కాగా పదోసారైనా ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తాయా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.


Next Story

Most Viewed