పార్టీలకు అతీతంగా పోరాడిన నేత వెంకటస్వామి

by  |
పార్టీలకు అతీతంగా పోరాడిన నేత వెంకటస్వామి
X

దిశ, ముషీరాబాద్:
పేద ప్రజల కోసం పార్టీలకు అతీతంగా పోరాడిన నేత వెంకటస్వామి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. పేదలకు గుడిసెలు వేయించి వారి మనసుల్లో గుడిసెల వెంకటస్వామిగా చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) 91వ జయంతిని పురస్కరించుకొని టాంక్ బండ్ పై నున్న ఆయన విగ్రహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లడుతూ… రాష్ట్రపతి కావాల్సిన మహానాయకుడు కాకా అని కొనియాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేస్తోందన్నారు. అనంతరం డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ… గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నేత కాకా అని అన్నారు. తెలంగాణ సాధనలో క్రియాశీలకంగా పనిచేసిన గొప్ప నాయకుడు వెంకటస్వామి అని కొనియాడారు.


Next Story

Most Viewed