కేసీఆర్ లేఖ నా దృష్టికి రాలేదు !

by  |
కేసీఆర్ లేఖ నా దృష్టికి రాలేదు !
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణానది నీటి వాటాల విషయంలో తెలుగు రాష్ట్రాల వాదనలు వింటామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్ ​తెలిపారు. తిరుమలలో శనివారం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ ​కేసీఆర్​ లేఖ నా దృష్టికి రాలేదని, ఈనెల 6న అపెక్స్ కౌన్సిల్​ భేటీ అవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ పరంగా ఎవరి హక్కులకూ భంగం కలిగించబోమని, న్యాయబద్ధంగానే నీటి వాటాల పంపకాలు ఉంటాయన్నారు. సుప్రీంకోర్టు కేసులను దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరిస్తామని, పోలవరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపిన బిల్లులు క్లియర్ చేసినట్లు వెల్లడించారు.



Next Story