బాలిక విలువ రెండు లక్షలా?

by  |
బాలిక విలువ రెండు లక్షలా?
X

దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా పల్లెగూడెంకు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక ఓ కామాంధుడి కిరోసిన్ దాడిలో మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అజయ్ కుమార్ బాలిక కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేశారు. దీనిపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. బాలిక విలువ రూ.2 లక్షలేనా? అంటూ బాలిక మృతదేహం వద్ద ధర్నా చేశారు. బతుకమ్మ వేడుకలకు రూ.కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం ఇక్కడ ముష్టి ఇచ్చిందన్నారు. బాలిక కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు.



Next Story