పేదలకు యూనియన్ బ్యాంకు భరోసా..

by  |
పేదలకు యూనియన్ బ్యాంకు భరోసా..
X

దిశ, మేడ్చల్: తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో పేదలు, వలస కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో బుధవారం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్మిక నగర్‌లో యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో పేదలు, కార్మికులకు భోజన ఏర్పాట్లు చేశారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్వయంగా కార్మికులు, పేదలకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో ఆయన వెంట మేయర్ కావ్య, శ్రీనివాస్, బ్యాంకు అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags: corona. lockdown, union bank cooperation, food provide, poor people



Next Story

Most Viewed