జగిత్యాలలో యువతిపై యాసిడ్ దాడి

by  |
జగిత్యాలలో యువతిపై యాసిడ్ దాడి
X

దిశ,వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ తండాలో స్వాతి అనే యువతిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేశారు. అనంతరం అక్కడి వారు పరారయ్యారు. యువతిని స్థానికులు మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ఘటనపై జగిత్యాల ఎస్పీ సింధు శర్మతో ఆమె పోన్‌లో మాట్లాడారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఎస్పీని కవిత కోరారు.



Next Story

Most Viewed