రాజేంద్రనగర్లో గుర్తు తెలియని వ్యక్తి హత్య..!

by  |
రాజేంద్రనగర్లో గుర్తు తెలియని వ్యక్తి హత్య..!
X

దిశ, రాజేంద్రనగర్: హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ పరిధిలోని పీవీ ఎక్స్‎ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 161 సమీపంలోని ఖాళీ స్థలంలో గురువారం అర్ధరాత్రి సమయంలో వ్యక్తి తలపై బండరాయిలో మోది హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి వయస్సు 40 ఏళ్లుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

Next Story