ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్..

by  |
ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్..
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్, స్టేషన్ ఘన్ పూర్ మండలాలలోని పలు గ్రామాలను జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిల్పూర్ మండలం లోని పల్లగుట్ట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని తాటికొండ, కొత్తపల్లి గ్రామాలను సందర్శించి త్వరితగతిన టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హాస్టల్ ను కలెక్టర్ సందర్శించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి మహేందర్, మండల ప్రత్యేక అధికారి నర్సయ్య, మండల వైద్యాధికారి శ్రీ వాణి, ఎమ్మార్వో విశ్వప్రసాద్, ఎంపీడీవో కుమారస్వామి,తదితరులు ఉన్నారు.


Next Story