ఆ విషయంలో గొడవ.. మామ, బావమరిదిని అక్కడ పొడిచి పరారైన అల్లుడు

by  |
crime news
X

దిశ, నిజామాబాద్ రూరల్: అల్లుడు చేతిలో మామ, బావమరిది హతమైన దుర్ఘటన రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండల కేంద్రం శివారులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం సంజీవరావు షిండే కుటుంబం కొన్ని నెలల క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్ర నుంచి డిచ్ పల్లి మండల కేంద్రానికి వచ్చారు. సంజయ్ షిండేకు ఒక కుమార్తె, ఒక కుమారుడు నాజీలానీ షిండే ఉన్నారు. కుమార్తె భర్త శివానంద్ కు మామ సంజీవరావు షిండే కుటుంబంకు మధ్య గత కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి మామ ఇంటికి వెళ్లిన అల్లుడు శివానంద్ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కోపోద్రికుడై న అల్లుడు శివానంద్, మామ సంజీవరావు షిండే, బామ్మర్ది నాజీలానీ షిండే పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో మామ అక్కడికక్కడే మృతిచెందగా, బామ్మర్ది నాజీలానీ షిండేకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అక్కడే ఆయన మృతిచెందినట్లు ఎస్సై ఆంజనేయులు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సీ.ఐ రఘునాథ్ సందర్శించారని, పంచనామ నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.



Next Story

Most Viewed