ఒక్క మ్యాచ్‌లో 11 గోల్స్.. ఒడిషా ఘనవిజయం

by  |
ఒక్క మ్యాచ్‌లో 11 గోల్స్.. ఒడిషా ఘనవిజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఒకే మ్యాచ్‌లో 11 గోల్స్ నమోదయ్యాయి. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా చివరకు ఒక్క గోల్ తేడాతో ఒడిషా జట్టు విజయం సాధించింది. ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి జీఎంసీ స్టేడియంలో ఈస్ట్ బెంగాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒడిషా జట్టు 6-5 తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఈస్ట్ బెంగాల్ క్లబ్ కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. 24వ నిమిషంలో వాహెన్‌బామ్ ఇచ్చిన పాస్‌ను ఆంటొనీ పిల్కింగ్‌స్టన్ గోల్ చేయడంతో 1-0 ఆధిక్యంలోకి ఈస్ట్ బెంగాల్ దూసుకొని పోయింది. 33వ నిమిషంలో ఒడిషా ఆటగాడు లార్హెజులా గోల్ చేశాడు.

కాగా, 37వ నిమిషంలో రవికుమార్ చేసిన ఓన్‌గోల్‌తో ఈస్ట్ బెంగాల్ ఆధిక్యంలోకి వెళ్లింది. 49వ నిమిషంలో బ్రాడెన్ ఇన్మాన్ ఇచ్చిన పాస్‌ను పాల్ గోల్‌గా మలిచి ఒడిషాకు గోల్ అందించాడు. 51వ నిమిషంలో మాన్యుయేల్ ఇచ్చిన పాస్‌ను జెర్రీ గోల్‌గా మలిచాడు. 60వ నిమిషంలో డానియెల్ ఫాక్స్ అందించిన పాస్‌ను ఆరోన్ జాషువా గోల్‌గా మలచడంతో ఈస్ట్ బెంగాల్‌కు మరో గోల్ లభించింది. 66వ నిమిషంలో పాల్ ఒడిషాకు మరో గోల్ అందించాడు. ఆ తర్వాతి నిమిషంలోనే జెర్రీ మరో గోల్ చేయడంతో ఒడిషా ఆధిక్యం 5-3కి పెరిగింది. ఒడిషా ఆటగాడు డియాగో మారికో 69వ నిమిషంలో ఒక గోల్.. ఆ తర్వాత జేజే, ఆరోన్ ఈస్ట్ బెంగాల్‌కు మరో రెండుగోల్స్ అందిచారు. నిర్ణీత సమయం ముగిసేసరికి 6-5 తేడాతో ఒడిషా జట్టు మ్యాచ్ గెలిచింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు డియాగో మారికో, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పాల్‌కు లభించింది.



Next Story

Most Viewed