ఎమ్మెల్యే సమక్షంలో.. కో-ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవం

by  |
ఎమ్మెల్యే సమక్షంలో.. కో-ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవం
X

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక శుక్రవారం ఏకగ్రీవంగా జరిగింది. స్థానిక ఇల్లందు క్లబ్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి హాజరై మున్సిపల్ కౌన్సిలర్ కో-ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మైనారిటీ సభ్యునిగా మహమ్మద్ ఇర్ఫాన్, నేరవట్ల కమల, బేతోజూ వజ్రమని, దొంగల ఐలయ్య ఎన్నికైన వారిలో ఉన్నారు.

భూపాలపల్లి పురపాలక కో-ఆప్షన్ మెంబర్‌గా ఎన్నుకోబడిన వారు మంచి పరిపాలనా దక్షతతో ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed