116కు చేరిన యూకే వేరియంట్ కేసులు

by  |
corona virus
X

న్యూఢిల్లీ: దేశంలో యూకే వేరియంట్‌ కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య తాజాగా 116కి చేరింది. యూకే వేరియంట్ జీనోమ్‌ సోకిన భారతీయుల సంఖ్య 116కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా రెండు కేసులు రిపోర్ట్ అయ్యాయని, శుక్రవారం ఈ కేసుల సంఖ్య 114గా ఉన్నదని వివరించింది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచనలు చేస్తున్నారు.


Next Story

Most Viewed