రిపబ్లిక్ డే చీఫ్‌ గెస్ట్‌గా యూకే పీఎం బోరిస్ జాన్సన్

by  |
రిపబ్లిక్ డే చీఫ్‌ గెస్ట్‌గా యూకే పీఎం బోరిస్ జాన్సన్
X

న్యూఢిల్లీ: ఈ సారి భారత గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ బోరిస్ జాన్సన్‌ను ఫోన్ చేసి ఆహ్వానించారు. నవంబర్ 27న వీరిరువరి మధ్య ఫోన్‌లో జరిగిన సంభాషణలో జాన్సన్‌ను ఆహ్వానించినట్టు తెలిసింది. అలాగే, వచ్చే ఏడాది యూకేలో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరవ్వాలని భారత ప్రధాని మోడీని యూకే పీఎం జాన్సన్ కోరినట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి. రిపబ్లిక్ డే పరేడ్‌కు బ్రిటన్ ప్రధానిగా చివరిసారి 1993లో జాన్ మేజర్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు.



Next Story

Most Viewed