త్వరలో ‘గోవు విజ్ఞాన’ పరీక్ష.. వర్సిటీలకు యూజీసీ లేఖ

by  |
త్వరలో ‘గోవు విజ్ఞాన’ పరీక్ష.. వర్సిటీలకు యూజీసీ లేఖ
X

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం దేశీయ గోవుకు సంబంధించిన సైన్స్‌పై పరీక్ష నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే యూజీసీ సుమారు 900 యూనివర్సిటీల వీసీలకు లేఖ రాసింది. గో విజ్ఞాన పరీక్ష రాయడానికి విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన రాష్ట్రీ కామధేను ఆయోగ్ వెబ్‌సైట్‌లో స్టడీ మెటీరియల్ ఉంచింది.

ఇప్పటికే సుమారు 5.10 లక్షల మంది ఈ పరీక్ష రాయడానికి ఎన్‌రోల్ చేసుకున్నట్టు అయోగ్ ప్రతినిధి పురీశ్ కుమార్ తెలిపారు. ఇందులో అశాస్త్రీయత ఏమీ లేదని, భారత గోవు బ్రీడ్‌లను ప్రొజెక్ట్ చేయాలనే ఈ పరీక్ష నిర్వహించే నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభాయ్ కథీరియా తెలిపారు

Next Story

Most Viewed