టీ20 వరల్డ్ కప్ బ్యాకప్ వెన్యూగా యూఏఈ?

by  |
టీ20 వరల్డ్ కప్ బ్యాకప్ వెన్యూగా యూఏఈ?
X

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో ప్రతీ రోజు రోజుకు లక్షల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన పురుషుల టీ20 వరల్డ్ కప్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వేదికను మార్చాల్సిన అవసరం ఉంటుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గత ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఇండియాలో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కూడా వాయిదా వేసే ఐసీసీకి భారీ నష్టం కలుగుతుంది.

దీంతో గతంలోనే ప్లాన్ బి తమ వద్ద ఉన్నదని ఐసీసీ వ్యాఖ్యానించింది. ఐసీసీ అధికారుల సమాచారం మేరకు యూఏఈ‌ని బ్యాకప్ వెన్యూగా నిర్దారించినట్లు తెలుస్తున్నది. గత ఏడాది ఐపీఎల్‌ను విజయవంతగా నిర్వహించిన రికార్డు ఉండటంతో పాటు విదేశీ ప్రయాణాలకు హబ్‌గా ఉన్న అక్కడ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించే అవకాశం ఉందని ఐసీసీ భావిస్తన్నది. అయితే వరల్డ్ కప్‌కు ఇంకా 6 నెలల సమయం ఉండటంతో ఇప్పుడు దీనిపై చర్చించడం అనసవరమని.. కాకపోతే ఇండియాలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఐసీసీ చెబుతున్నది.



Next Story

Most Viewed