మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా..

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్ : కరోనా రక్కసి సెకండ్ వేవ్ రూపంలో విలయతాండవం చేస్తుంది. కరోనా బారిన పడేవారికి సంఖ్య అధికమవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను విధించింది. అయితే తాజాగా విజయనగరం జిల్లాలో మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర లకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో వారు ఐసోలేషన్ లోకి వెళ్లారు. ప్రస్తుతం వారు [&hellip;]</p>

Corona virus
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా రక్కసి సెకండ్ వేవ్ రూపంలో విలయతాండవం చేస్తుంది. కరోనా బారిన పడేవారికి సంఖ్య అధికమవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను విధించింది. అయితే తాజాగా విజయనగరం జిల్లాలో మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర లకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో వారు ఐసోలేషన్ లోకి వెళ్లారు. ప్రస్తుతం వారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే లను కలిసిన వారు పరీక్షలు చేయించుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Next Story