- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వర్థన్నపేట : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్లోనే చనిపోయారు. వీరి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా తయారయ్యాయి. యువకులపై శరీరాలపై నుంచి లారీ వెళ్లడంతో తునతునకలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన బుధవారం రాత్రి హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులో ప్రధాన రహదారిపై జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను అటుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన అఖిల్, నల్లబెల్లి గ్రామానికి చెందిన చెంగళ రాహుల్గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.