రాయల్ ఎన్‌ ఫీల్డ్‌ పై రాయల్‌గా వెళ్తుండగా.. తునాతునకలైన యువకుల శరీరాలు

by  |
రాయల్ ఎన్‌ ఫీల్డ్‌ పై రాయల్‌గా వెళ్తుండగా.. తునాతునకలైన యువకుల శరీరాలు
X

దిశ, వర్థన్నపేట : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. వీరి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా తయారయ్యాయి. యువకులపై శరీరాలపై నుంచి లారీ వెళ్లడంతో తునతునకలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన బుధవారం రాత్రి హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులో ప్రధాన రహదారిపై జరిగింది.

స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను అటుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన అఖిల్, నల్లబెల్లి గ్రామానికి చెందిన చెంగళ రాహుల్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed