- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐసీటీ కంప్యూటర్ల ప్రారంభం
by Batti.Sumithra |
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఐసీటీ కార్యక్రమంలో భాగంగా మంజూరైన కంప్యూటర్లను మండల విద్యాధికారి మేకర్తి వెంకటేశ్వర్లు, గంగాపూర్ గ్రామ సర్పంచ్ వెంకటేశం, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్పర్సన్ భీంబాయి సంయుక్తంగా ప్రారంభించారు.

X
దిశ, రెబ్బెన : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఐసీటీ కార్యక్రమంలో భాగంగా మంజూరైన కంప్యూటర్లను మండల విద్యాధికారి మేకర్తి వెంకటేశ్వర్లు, గంగాపూర్ గ్రామ సర్పంచ్ వెంకటేశం, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్పర్సన్ భీంబాయి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడంలో ఐసీటీ కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్బత్రావు, ఉపాధ్యాయులు దుర్గం శ్రీనివాస్, రత్నం సంజీవ్, దుర్గం రాజేష్, బద్రి జాన్సీతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story






