మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు యువకుల హత్య

by  |
మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు యువకుల హత్య
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జేగురుగొండ-చింతలనార్ నడుమ మిల్లంపల్లి సమీపంలో రోడ్డుపై ఇద్దరు యువకుల మృతదేహాలను సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతులు మదకం అర్జున్, తాతి హిడ్మాలుగా గుర్తించారు. మృతదేహాల పక్కన కరపత్రాలు పడేశారు.

ఆదివారం అర్థరాత్రి ఈ హత్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఎస్‌పికే ఎల్ ధృవ్ ధృవీకరించారు. ఈ ఇద్దరు యువకులను వేరే చోట హత్య చేసి మృతదేహాలను రోడ్డు పక్కన పడేసినట్లుగా భావిస్తున్నారు. వీరు గతంలో సల్వాజుడుంలో పనిచేశారు. పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. జేగురుగొండ ఏరియా కమిటీ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed