చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి…

by  |
చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి…
X

ప్రమాదవశాత్తు కుంటలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం కోర్‌పోల్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఇరువురు గురువారం స్థానికంగా పశువులను మేతకు తీసుకెళ్లారు. దప్పిక తీర్చుకోవడం కోసం పశువులు చెరువులోకి వెళ్లాయి. చాలా సేపయినా అవి బయటకు రాకపోవడంతో వాటిని బయటకు రప్పించేందుకు ఇద్దరూ చెరువులోకి దిగారు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు చెరువులో పడి దిలీప్(08), రాజు (18) అనే యువకులు మృతిచెందారు. ఇద్దరూ సమీప బందువులేనని స్థానికులు అంటున్నారు.

Next Story

Most Viewed