విషాదం.. నీటిసంపులో పడి రేండెళ్ల చిన్నారి మృతి

by  |
nithya
X

దిశ, ఎల్బీనగర్: హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకుల గుట్ట సమీపంలోని సుధీర్ కుమార్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నిత్య అనే రెండేళ్ల చిన్నారి నీటిసంపులో పడి మృతిచెందింది. రోజూ ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగే తమ చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే, అప్పటివరకు ఆడుకుంటున్న నిత్య ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు గంటసేపటి తర్వాత సంపులో పడిన చిన్నారిని గుర్తించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, రాజు, సంతోషి దంపతులకు నిత్య మూడో సంతానం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed