గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి

by  |

చిత్తూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుప్పం మండలం తంబిగానిపల్లిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వెల్డింగ్ దుకాణంలో క్రేన్‌కు వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో అఫ్సర్(30), ఎజాబ్ అనే కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, వెల్డింగ్ షాపు యజమాని, క్రేన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Next Story