రెండు ద్విచక్ర వాహనాలు ఢీ…ఒకరు మృతి

by  |
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ…ఒకరు మృతి
X

దిశవెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడిపత్రి పరిధిలోని చుక్కలూరు రోడ్డు క్రాస్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో హనీఫ్(22)అనే వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హనీఫ్ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed