వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకులు

by  |
వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకులు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తుర్కయంజాల్ చెరువు ప్రవాహానికి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా వరద ఉధృతికి కొట్టుకుపోయారు. వెంటనే యువకుల కుటుంబ సభ్యులు పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో తుర్కయంజాల్‌ చెరువు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో యువకులు ఎంతదూరం కొట్టుకుపోయారనేది ఆందోళన కలిగిస్తోంది.


Next Story

Most Viewed