కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్‌కు మరో షాక్

by  |
కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్‌కు మరో షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ ప్రభావం ఐపీఎల్‌పై పడింది. దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా పలువురు క్రికెటర్లు లీగ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఐపీఎల్ నుంచి ఇద్దరు అంపైర్లు తప్పుకుంటున్నారు. భారత్‌కు చెందిన అంపైర్ నితిన్​మేనన్, ఆస్ట్రేలియాకు చెందిన పాల్​రీఫెల్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, తన కుటుంబ సభ్యులు కరోనా బారినపడిన కారణంగా తాను లీగ్ నుంచి తప్పుకుంటన్నట్టు అంపైర్ నితిన్ మేనన్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో ప్రయాణ ఆంక్షలు విధించడం వల్ల తాను తమ దేశం వెళ్లేందుకు.. లీగ్‌ను వీడుతున్నట్టు ఆసీస్ అంపైర్ రీఫెల్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed