ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

by  |
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
X

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా మెల్‌హురాలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా సిబ్బంది జైనపొర ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. మరో ఉగ్రవాది కోసం పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు జవాన్లు.

Tags: encounter, jammu kashmir, two terrorists dead, jaipur

Next Story

Most Viewed