- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, అచ్చంపేట : సెల్ఫీ మోజు ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలో దిండి ప్రాజెక్టు వద్ద ఇద్దరు యువకులు సెల్ఫీ దిగుతూ కాలుజారి ప్రాజెక్టులో పడిపోయి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతుల స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ నుండి ఆదివారం ఉదయం ఐదు మంది స్నేహితులు హైదరాబాద్కు చెందిన మహమ్మద్తో కలిసి శ్రీశైలం వెళ్తూ.. మార్గమధ్యలో దిండి ప్రాజెక్టు వద్ద ఆగామని తెలిపారు.
ఈ క్రమంలో ప్రాజెక్టుపై నుండి పారుతున్న నీటిని తిలకిస్తూ సాగర్, మహమ్మద్లు మొబైల్తో సెల్ఫీలు తీసుకుంటుండగా కాలుజారి నీటిలో పడిపోయారని తెలిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారని స్నేహితులు ఆవేదన చెందారు. విషయం తెలుసుకున్న దిండి ఎస్ఐ పోచయ్య ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.