మినీ ట్యాంక్ బండ్‌లో మృతదేహాలు.. హత్యా, ఆత్మహత్య ?

by  |
మినీ ట్యాంక్ బండ్‌లో మృతదేహాలు.. హత్యా, ఆత్మహత్య ?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో మినీ ట్యాంక్ బండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి శవం నీటిపై తేలుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, మూడు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు చెరువులో దూకడాన్ని స్వయంగా చూశానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కానీ గురువారం ఉదయం మృతదేహం నీటిపై తేలుతూ ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.

మూడు రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం నిజమేనని పోలీసులు భావిస్తున్నారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్న చెరువులో గుర్రపు డెక్కలు అల్లుకొని ఉండడంతో గాలింపు ఇబ్బందికరంగా మారింది. ఆత్మహత్యకు పాల్పడింది ఇద్దరా, ఒక్కరా అనే విషయాలతో పాటు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరు..? కారణాలు ఏమిటి అనేవి తెలియాల్సి ఉంది. మూడు వారాల క్రితమే ఇంజనీరింగ్ విద్యార్థిని ట్యాంక్ బండ్‌లో పడి ఆత్మహత్య చేసుకోవడం, ఇప్పుడు మరో మృతదేహాన్ని గుర్తించడం, మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టడం జనాలకు భయాందోళనలు కలిగిస్తున్నాయి.

Next Story

Most Viewed