- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రాజెక్టులో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాది కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టులోకి దిగిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం గుబ్బలమంగి ప్రాజెక్టులో శుక్రవారం చోటుచేసుకుంది. తాటివారి గూడెం గ్రామానికి చెందిన గొంది కిరణ్, జిన్నాలగూడెంకి చందిన పోడియం రవికుమార్ ఇద్దరు ప్రాజెక్టు వద్దకు స్నేహితులతో కలసి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టులోకి దిగిన ఇద్దరు నీట మునిగిపోయారు. స్నేహితులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. కొద్ది సమయం తర్వాత ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
Next Story