విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

by  |
విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి
X

దిశ, మొయినాబాద్: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోర వెంకటేష్ కూతుర్లు ప్రేమిక (18) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సౌమ్య (18) డిగ్రీ చదువుతుండగా, తమ్ముడి కూతురు అక్షయ 9వ తరగతి చదువుతోంది. శనివారం రాత్రి తమ స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా సమీపంలో ఉన్న తాజ్ హోటల్‌కి వెళ్లారు.

ఫంక్షన్‌ నుంచి వస్తుండగా తిరుగు ప్రయాణంలో చేవెళ్ల మీదుగా హైదరాబాద్‌కు వస్తున్న షిఫ్ట్ కారు స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ మీద ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయారు. ప్రేమిక (16)కు తీవ్రమైన గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ఇద్దరికి కూడా తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం 108లో హైదరాబాద్ తరలించారు.

కాగా, శనివారం అక్కడికక్కడే మరణించిన ప్రేమిక అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉన్న సౌమ్య (18) సోమవారం ఉదయం మరణించినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోక సముద్రంలో మునిగిపోయారు. నిందితుడు సంపత్ రెడ్డి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని చర్లపల్లి జైలుకు తరలించినట్టు మెయినాబాద్ సీఐ తెలిపారు.

Next Story

Most Viewed