ఖమ్మంలో రెండు కరోనా కేసులు

by  |
ఖమ్మంలో రెండు కరోనా కేసులు
X

దిశ‌, పాలేరు : ఖ‌మ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. ఇటీవలే వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళొచ్చిన ఓ జంటకు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లో నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్ తేలింది. విషయం తెలుసుకున్న మండల అధికారులు ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్ర‌క‌టించారు.

కానిస్టేబుల్‌కు కరోనా..

హైదరాబాద్‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఓ కానిస్టేబుల్‌‌కు క‌రోనా పాజిటివ్‌ వచ్చింది. అత‌డి స్వ‌స్థ‌లం ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం చొప్పకట్ల పాలెం. అతను ఇటీవ‌ల హైద‌రాబాద్ నుంచి గ్రామానికి వ‌చ్చి వెళ్లాడు.విషయం తెలుసుకున్న అధికారులు అప్ర‌మ‌త్త‌మై అత‌డితో సన్నిహితంగా ఉన్న గ్రామస్థులు, కుటుంబాన్ని హోం క్వారంటైన్ చేశారు.

Next Story