పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మిస్సింగ్

by  |
missing-joo
X

దిశ, జవహర్ నగర్: జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేరువేరు ఘటనలో రెండు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. సీఐ బిక్షపతి రావు తెలిపిన కథనం ప్రకారం.. బీదర్ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వచ్చి దమ్మాయిగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న వర్మ విజయ్ కూతురు జ్యోతి(20) చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ఓ టాబ్లెట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. శుక్రవారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో జ్యోతి తండ్రి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరో బాలుడు..
పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి నగర్ గబ్బిలాల పేటలో నివాసం ఉండే సంపంగి యాదయ్య కుమారుడు చంటి (17) ఈనెల 2న బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story