మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

by  |
మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అందులో ఒకరు వయస్సుల పెద్దవారు కాగా, మరొకరు విద్యార్థిగా తెలుస్తోంది. ఈ ఘటన జిల్లాలోని భూత్పూర్ మండలం అన్న సాగర్ గ్రామం వద్ద సోమవారం రాత్రి వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో అర్జునయ్య అక్కడికక్కడే మరణించగా, కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను కూడా మరణించాడు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది.

ఎస్ఐ భాస్కర్‌ రెడ్డి కథనం ప్రకారం.. అన్నసాగర్ గ్రామానికి చెందిన అర్జునయ్య (40), కిరణ్(17) టీవీఎస్ వాహనంపై గాజులపేట గ్రామానికి వెళ్లి వస్తుండగా.. గాజులపేట స్టేజీ దాటాక జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన కిరణ్‌ను భూత్పూర్ మండల కేంద్రంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమించి అతనుమృతి చెందగా, అర్జునయ్య మాత్రం స్పాట్‌లోనే మరణించాడు. మృతుల కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story

Most Viewed