ఘోర ప్రమాదం: స్పాట్‌‌లోనే ప్రాణం విడిచిన యువకులు

by  |
ఘోర ప్రమాదం: స్పాట్‌‌లోనే ప్రాణం విడిచిన యువకులు
X

దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు తండా దగ్గర ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఎరుగొండ రాంబాబు (22) తన సోదరుని వివాహ పనుల నిమిత్తం దంటతాలపల్లి నుంచి కుమ్మరికుంటకు వెళ్లాలని అనుకున్నాడు. ఈ మేరకు తన బంధువు పర్వతమ్మ గూడెం గ్రామానికి చెందిన నిదనవెల్లి మహేశ్ (21)ను వెంటతీసుకుని బయలు దేరాడు. తూర్పు తండ శివారులో ఓ లారీని మరమ్మతుల కోసం డ్రైవర్ పక్కకు నిలిపివేశారు. ఈ సమయంలో వారు ప్రయాణిస్తున్న బైక్ వేగంగా లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు దర్యాప్తు చేస్తన్నారు.

Next Story