- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు తండా దగ్గర ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఎరుగొండ రాంబాబు (22) తన సోదరుని వివాహ పనుల నిమిత్తం దంటతాలపల్లి నుంచి కుమ్మరికుంటకు వెళ్లాలని అనుకున్నాడు. ఈ మేరకు తన బంధువు పర్వతమ్మ గూడెం గ్రామానికి చెందిన నిదనవెల్లి మహేశ్ (21)ను వెంటతీసుకుని బయలు దేరాడు. తూర్పు తండ శివారులో ఓ లారీని మరమ్మతుల కోసం డ్రైవర్ పక్కకు నిలిపివేశారు. ఈ సమయంలో వారు ప్రయాణిస్తున్న బైక్ వేగంగా లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు దర్యాప్తు చేస్తన్నారు.