అమరావతి భూకుంభకోణంలో ఇద్దరి అరెస్టు

by  |
అమరావతి భూకుంభకోణంలో ఇద్దరి అరెస్టు
X

దిశ ఏపీ బ్యూరో: అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసి, రికార్డులు మార్చి ప్రభుత్వ భూసేకరణకు అందజేసి లబ్ది పొందారన్న ఆరోపణలపై ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో గుమ్మడి సురేశ్‌ కిలకమైన వ్యక్తి అని, నిబంధనలకు విరుద్ధంగా దళితులు సాగుచేసుకుంటున్న అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయగా, ఆ భూముల రికార్డుల తారుమారు వ్యవహారంలో తుళ్లూరు రిటైర్డ్‌ తహసిల్దార్‌ సుధీర్ ‌బాబు పాత్ర ఉందని వారిద్దర్నీ అరెస్టు చేసి, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో గుంటూరు జైలుకు తరలించారు.

Next Story