మసీదుపై 'జై శ్రీరామ్'.. ఇద్దరు అరెస్ట్

by  |
మసీదుపై జై శ్రీరామ్.. ఇద్దరు అరెస్ట్
X

దిశ, ముధోల్: ఇరువర్గాల ఘర్షణలు జరిగే పేరున్న బైంసా ప్రాంతంలో మరో వివాదం చెలరేగింది. ఈనెల 24వ తేదీన భైంసా పట్టణంలోని పంజాషా మసీదుపై ‘జై శ్రీరామ్’ అని రాసిన ఇద్దరు వ్యక్తులను తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు ఏ ఎస్ పి కిరణ్ కారే తెలిపారు. ఈ నెల 24తేదీ రాత్రి 10.30 నిమిషాల ప్రాంతంలో మహమ్మద్ అబ్దుల్ కైఫ్( 20) అనే వ్యక్తి మసీదుపై జై శ్రీరామ్ అని రాయమని చెప్పగా … 14 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక మైనర్ బాలుడు తన పాకెట్ లో ఉన్న మార్కర్ తో ‘జైశ్రీరామ్’ అని బైంసా పంజాషా మసీదుపై రాసాడు.

దీనిపై కేసు నమోదు చేసుకుని సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు ఏఎస్పీ కిరణ్ కారే తెలిపారు. ప్రజలు మందిరాలు, మసీదులు, తమ షాపులు, ఇండ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో.. ఇలా నిందితుల్ని గుర్తించడానికి వీలు అవుతుందన్నారు.


Next Story

Most Viewed