సెల్ఫీ మోజులో.. ప్రాణాలు గాలిలో

by  |
సెల్ఫీ మోజులో.. ప్రాణాలు గాలిలో
X

దిశ ,బెల్లంపల్లి : యువత వెర్రి పుంతలు తొక్కుతూ సెల్ఫీ వీడియో తీస్తూ ఈత రాక కుంట‌లో పడి ప్రాణస్నేహితులు మృతి చెందిన సంఘటన తాండూరు సర్కిల్ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాదారం టౌన్షిప్ లో చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులుగా పెరిగిన వాసు సతీష్‌లు మరణంలోనూ కూడా కలిసే మృతి చెందడం పలువురిని కలిచి వేసింది. బుధవారం ఉదయం మాదారం టౌన్ షిప్‌ పరిధిలోని ఓ నీటి కుంటలో సెల్ఫీ వీడియో తీసుకునేందుకు వెళ్లి మృతిచెందిన శవాలు బుధవారం అర్ధరాత్రి సంబంధిత రైతు గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది.

తాండూరు మండలం మాదారం టౌన్షిప్ లోని శివారు ప్రాంతంలో గల నీటి కుంటలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. టౌన్షిప్ కు చెందిన దూడంసతీష్ (21) ఆర్జి వాసు (18)అనే ఇద్దరు యువకులు మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇంటి నుండి వెళ్లినట్లు వారి కుటుంబీకులు తెలిపారు. అర్ధరాత్రి వరకు ఇంటికి రాకపోగా బుధవారం కూడా తోటి మిత్రులతో పాటు చుట్టుపక్కల వాళ్ళు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో మల్లయ్య అనే రైతు తన పంట చేను వద్దకు వెళ్లి కుంట వైపు చూడగా ఇద్దరు యువకుల చనిపోయినట్లు కనిపించడంతో వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. యువకులు మృతి చెందిన విషయాన్ని కుటుంబీకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సర్కిల్ ఇన్ స్పెక్టర్ బాబురావు, మాదారం ఎస్ఐ మానసలు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. రాత్రి కావడంతో నీటి కుంటలోకి వెళ్లేందుకు వీలులేకుండా ఉండడంతో స్థానికుల సహాయంతో మృతదేహాలను దగ్గర ఉండి బయటకు వెలికితీశారు . అనతరం శవ పంచనామా నిమిత్తం మృతదేహాలను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మాదారం ఎస్ఐ మానస కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed