బ్రేకింగ్ : తీరని విషాదం మిగిల్చిన సిద్దిపేట కారు ప్రమాదం..

by  |
బ్రేకింగ్ : తీరని విషాదం మిగిల్చిన సిద్దిపేట కారు ప్రమాదం..
X

దిశ, వెబ్‌డెస్క్ : సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద జరిగిన కారు ప్రమాదం తీరని విషాదం మిగిల్చింది. అతివేగంతో అదుపుతప్పిన కారు వ్యవసాయ బావిలో పడిన విషయం తెలిసిందే. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది బావిలోని నీటిని తోడి కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మృతులు ప్రశాంత్, తల్లి భాగ్యలక్ష్మిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed