- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు దేశవ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రతిఒక్కరూ నేడు రెండు నిమిషాలు మౌనం పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశించింది. దేశ ప్రజలందరినీ మమేకం చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎక్కడివారు అక్కడే.. పనులు, కదలికలు ఆపేయాలని సూచించింది. ప్రారంభ, ముగింపు సమయాల్లో సైరన్లు, తుపాకుల శబ్ధం చేయాలని పేర్కొంది. స్వాతంత్య్రోద్యమం, జాతీయ సమైక్యతపై చర్చించాలని […]</p>

X
దిశ, వెబ్డెస్క్: అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రతిఒక్కరూ నేడు రెండు నిమిషాలు మౌనం పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశించింది.
దేశ ప్రజలందరినీ మమేకం చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎక్కడివారు అక్కడే.. పనులు, కదలికలు ఆపేయాలని సూచించింది. ప్రారంభ, ముగింపు సమయాల్లో సైరన్లు, తుపాకుల శబ్ధం చేయాలని పేర్కొంది. స్వాతంత్య్రోద్యమం, జాతీయ సమైక్యతపై చర్చించాలని సూచించింది. కరోనా నిబంధనలు విస్మరించకూడదని కేంద్రం పేర్కొంది.
Next Story






