ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి ఇద్ద‌రు మృతి

by  |
ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి ఇద్ద‌రు మృతి
X

దిశ, మ‌ణుగూరు: ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డి ఇద్ద‌రు కార్మికులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుండాల మండ‌లం ముక్తాపురం గ్రామంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్మికులు మృతి చెందారు. మృతులు పుణ్యం వసంతరావు (22) అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, పూనం బుచ్చయ్య(65)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులుద దర్యాప్తు చేపట్టారు.



Next Story