పల్టీకొట్టిన టాటా ఏస్.. ఇద్దరు మృతి

by  |
పల్టీకొట్టిన టాటా ఏస్.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని తమ్మడిపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది. మృతులు చేర్యాలకు చెందిన బుడిగే మల్లయ్య, జనగామకు చెందిన చెన్నమ్మగా గుర్తించారు.

సమాచారం అందుకున్న బచ్చన్నపేట ఎస్ఐ లక్ష్మణరావు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వారు తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు.



Next Story