ములుగు జిల్లాలో కారు బైకు ఢీ.. ఇద్దరు మృతి

by  |
ములుగు జిల్లాలో కారు బైకు ఢీ.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ములుగు జిల్లా వాజేడు మండలంలోని మండపాక జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఆ సమయంలో కారు చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి హైదరాబాదు వెళ్తుండగా, ద్విచక్రవాహనం వెంకటాపురం వైపునకు ప్రయాణిస్తోంది. ఈ ఘటన రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకోగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story