ఖమ్మం రూరల్‌లో 18 కేజీల గంజాయి పట్టివేత

by  |
ఖమ్మం రూరల్‌లో 18 కేజీల గంజాయి పట్టివేత
X

దిశ, ఖమ్మం రూరల్​ : అక్రమంగా తరలిస్తున్న 18 కేజీల గంజాయిని ఎక్సైజ్​పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్​అండ్​ ప్రోహిబిషన్ ​సీఐ జయ శ్రీ బృందం శనివారం రాత్రి ఖమ్మం రూరల్ మండలం వరంగల్​క్రాస్​రోడ్డులో వాహన తనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద18 కేజీల గంజాయిని దొరికిందన్నారు.

ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్రం నుంచి ఖమ్మం మీదుగా మహరాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితులను షేక్​ అస్లాం, కేవరి అమూల్‌లుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించినట్టు ఆమె తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ ప్రసాద్, హెడ్​కానిస్టేబుల్​నాయక్, నరేందర్, ప్రభాకర్, వీరభద్రం, సురేందర్, గురుప్రసాద్ తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed