- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం రూరల్ : అక్రమంగా తరలిస్తున్న 18 కేజీల గంజాయిని ఎక్సైజ్పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్అండ్ ప్రోహిబిషన్ సీఐ జయ శ్రీ బృందం శనివారం రాత్రి ఖమ్మం రూరల్ మండలం వరంగల్క్రాస్రోడ్డులో వాహన తనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద18 కేజీల గంజాయిని దొరికిందన్నారు.
ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్రం నుంచి ఖమ్మం మీదుగా మహరాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితులను షేక్ అస్లాం, కేవరి అమూల్లుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించినట్టు ఆమె తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ ప్రసాద్, హెడ్కానిస్టేబుల్నాయక్, నరేందర్, ప్రభాకర్, వీరభద్రం, సురేందర్, గురుప్రసాద్ తదితరులు ఉన్నారు.
Next Story