ఐపీఎల్‌లో నేడు మళ్లీ డబుల్ ధమాకా

by  |
ఐపీఎల్‌లో నేడు మళ్లీ డబుల్ ధమాకా
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020 ప్రారంభం నుంచి రసవత్తరంగా కొనసాగుతోంది. వరుస సూపర్​ ఓవర్లు.. ఉత్కంఠభరితమైన ఆటలతో క్రీడాభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలో నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాక ఉండనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు తలపడనుంది. అబుదావి వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌ కోల్‌కతాకు కీలకం కానుంది. ఎలాగైనా నెగ్గి ప్లేఆఫ్‌లో అడుగుపెట్టాలని కోల్‌కతా భావిస్తోంది. అంతేగాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి, జోరు కొనసాగించాలని చూస్తోంది.

అనంతరం రాత్రి 7:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా రెండు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుకు ప్లేఆఫ్‌లో అవకాశం దొరకడం కష్టంగా మారుతుంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే రెండు మ్యాచ్‌లు, నాలుగు జట్లకు ఎంతో కీలకం. మరి ఏ జట్టుపై ఏ జట్టు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.


Next Story

Most Viewed